Friday, October 4, 2024

స్పృహ తప్పిన షర్మిల – అరెస్ట్

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె ను బేగం పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు వివరాలలోకి వెళితే. తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆమె నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టారు. అనంతరం ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అటు ఆమెకు మద్దతిచ్చేందుకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఆమె స్పృహతప్పి పడిపోయారు. షర్మిల తేరుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement