Saturday, September 21, 2024

HYD: సత్యనారాయణ యాదవ్ మృతి తీరని లోటు… తలసాని

హైదరాబాద్‌ : యాదవ జాతి కుల పెద్ద సత్యనారాయణ యాదవ్ మృతి తీరని లోటని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. కాచిగూడకు చెందిన యాదవ సంఘం కుల పెద్ద బత్తుల సత్యనారాయణ యాదవ్ శుక్రవారం సాయంత్రం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నింబోలి అడ్డాలోని వారి నివాసానికి వెళ్లి సత్యనారాయణ యాదవ్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాదవ సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన, యాదవ సమాజానికి ఎనలేని సేవలు అందించిన సత్యనారాయణ యాదవ్ మృతి చాలా బాధాకరమ‌ని తెలిపారు. ఆయన మృతి వారి కుటుంబానికే కాకుండా యాదవ సంఘానికి, యాదవ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. మరణ వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.


బాబురావు యాదవ్ కు పరామర్శ…
ఇటీవల అనారోగ్యానికి గురైన అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు బద్ధుల బాబూరావు యాదవ్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. శనివారం కాచిగూడలోని నింబోలి అడ్డాలో గల వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement