Friday, October 18, 2024

HYD | పోలీసుల అదుపులో ఆర్‌‌జే శేఖ‌ర్ బాషా…

హైద‌రాబాద్ : ఆర్‌జే శేఖ‌ర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు యూట్యూబర్ హర్ష సాయి త‌న‌ను లైంగికంగా దాడి చేయ‌డంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఒక యువ‌తి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. అలాగే తనను నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు యువ‌తి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో హ‌ర్ష సాయికి మ‌ద్దతుగా శేఖ‌ర్ బాషా మాట్లాడ‌టంతో పాటు త‌న‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని బాధిత యువ‌తి శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement