Friday, September 20, 2024

HYD: ఏపీ అండ్ తెలంగాణలో ఉత్పత్తి, పంపిణీని పెంచిన పిడిలైట్ రాఫ్

హైద‌రాబాద్: పిడిలైట్ ఇండస్ట్రీస్ నుండి ప్రముఖ టైల్స్ ఎడ్హెసివ్ బ్రాండ్ అయిన రాఫ్ హైదరాబాద్ సమీపంలోని జడ్చర్లలో తమ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఈశాన్య కర్ణాటక మార్కెట్లలో అధిక నాణ్యత గల టైల్ ఎడ్హెసివ్ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ఈ సదుపాయం తోడ్పడనుంది.

ఈసంద‌ర్భంగా పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ పూరి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్‌లలో ప్రీమియం, ప్రత్యేక ఉత్పత్తులకు డిమాండ్‌ పరంగా స్థిరమైన పెరుగుదలను తాము గమనించామన్నారు. టైల్ అండ్ స్టోన్ ఫిక్సింగ్‌ను ఆధునీకరించాలనే త‌మ‌ లక్ష్యంకు అనుగుణంగా త‌మ జడ్చర్ల ప్రాజెక్ట్ ఉందన్నారు.

- Advertisement -

వినియోగదారులకు మేలైన ఎడ్హెసివ్ పదార్థాలను అందించడం, తయారీని మార్కెట్‌లకు చేరువ చేయడం త‌మ లక్ష్యమ‌న్నారు. పిడిలైట్ ఇండస్ట్రీస్ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సదుపాయం జీరో-వేస్ట్ ప్లాంట్‌గా పనిచేస్తుందన్నారు. 80శాతం సౌరశక్తితో నడుస్తుందని, నిర్మాణ రసాయనాల రంగంలో పర్యావరణ అనుకూల తయారీకి కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement