Monday, September 16, 2024

HYD: సుప్రీంకోర్టు తీర్పుపై.. 124 ఆల్విన్ కాలనీలో ఎస్సీ, ఎస్టీ నాయకుల సంబరాలు

కూకట్ పల్లి : మాదిగల చిరకాల కోరిక ఎస్సీ, ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున, తెలంగాణ రాష్ట్రంలోఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన శుభసంధర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఎల్లమ్మ బండ పీజేఆర్ నగర్ లో గల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బ్యాండు బాజాలతో నృత్యాలు చేస్తూ.. టపాకాయలు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు మాట్లాడుతూ…. ఏబీసీడీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులకు జోహార్లు తెలియజేశారు. గత 30సంవత్సరాలుగా ఉద్యమపోరాటం చేసిన పలు సంఘాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పీఎల్ ప్రసాద్, నిక్నార్, బుల్లెట్ రవి, కొత్తదొడ్డి జాన్, సి.మల్లేష్, పాలడుగు జానయ్య, గుడ్ల శ్రీనివాస్, జగదీష్, కర్నాటక రాజు, సురేష్, మహేష్, గిరి, ఆదర్శ్, సాయి, ప్రసాద్, చంద్రయ్య, చెన్నయ్య, సిద్దయ్య, సామ్యూల్, కృష్ణ, ఇంత్యాజ్, సుధాకర్, స్టీవెన్, ప్రభాకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement