Wednesday, September 18, 2024

‘కేసీఆర్’ ని కలిసిన ‘పల్లా రాజేశ్వర్’

హైదరాబాద్ : ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి . తనపై నమ్మకంతో మరోసారి టికెట్‌ కేటాయించి విజయానికి అన్నివిధాలా అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పల్లా వెంట నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement