Sunday, October 6, 2024

ISCON – జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన రేవంత్

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించారు.

అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ”సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తాం. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో మా ప్రభుత్వం పని చేస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుంది” అని రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement