Monday, October 7, 2024

HYD | ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం..

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సెల్లార్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో హోటల్ సిబ్బంది, క‌స్ట‌మ‌ర్లు భయాందోళనకు గురయ్యారు. వెంటనే హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సెల్లార్‌లోని జనరేటర్ గ‌దిలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. జనరేటర్ గదిలో స్క్రాప్, పేపర్లు ఉండడంతో మంటలు వ్యాపించాయ‌ని అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. జనరేటర్ వేడి కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement