Saturday, October 5, 2024

TS | కవిత జ్యూడిషియల్​ కస్టడీ పొడిగింపు

ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో అరెస్టు అయిన విషయం విదితమే. కాగా, ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆమె జ్యూడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. దీంతో కోర్టు ఎదుట వర్చువల్ గా సీబీఐ అధికారులు హాజరుపరిచారు. అయితే ఇదే కేసులో అరెస్టు కాబడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరుపై చేయగా హైకోర్టు స్టే ఇవ్వడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement