Friday, October 18, 2024

TG: మత్తుకు బానిస కావద్దు – పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన యశస్వి మల్కా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు యశస్వి మల్కా (సీఈఓ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, నాచారం) చేతుల మీదుగా యువత మేలుకో స్వచ్చంద సంస్థ యాంటీ డ్ర‌గ్స్ క్యాంపెయిన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. యువ విద్యార్థి లోకం మన భారతదేశం, అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు, దాని వల్ల అమూల్యమైన యువత జ్ఞాన సంపద నిర్వీర్యం అవుతుందని, అది ఎంతో బాధాకరమైన విషయ‌మ‌న్నారు.

ఈ సందర్భంగా పిల్లలకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ యాంటీ డ్రగ్ వారియర్ లో తను భాగస్వామ్యం అవుతానని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, యాంటీ డ్రగ్స్ విభాగం చాలా ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్ర‌గ్స్ ను నిర్మూలించాలని సకల్పించిందన్నారు. దానికోసం తనవంతు సహకారం అందిస్తానని యశస్వి మల్కా తెలిపారు. ఈనెల 27వ తేదీన పల్లవి స్కూల్స్ ఆల్వాల్ లో ప్రొగ్రామ్ చేస్తారని తెలిపారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ పురుషోత్తం చాట్లపెల్లి కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement