Sunday, October 6, 2024

HYD: పీర్జాదిగూడలో కూల్చివేతలు.. అడ్డుకున్న మేయర్, కార్పొరేటర్ల అరెస్టు

మేడిపల్లి, జులై 8 (ప్రభ న్యూస్). పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. 3వ డివిజన్ సాయిఐశ్వర్య కాలనీ సర్వే నెంబర్ 1 లో సీలింగ్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని రెవెన్యూ అధికారులు ఉదయం పోలీసుల మద్దతుతో నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించారు.

విషయం తెలుసుకున్న మేయర్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులతో అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. అన్యాయమని రెవెన్యూ అధికారులతో వాదించారు. జేసీబీకి అడ్డంగా నిలబడిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాంగ్రెస్ కక్ష్య సాధింపు చర్య…మేయర్ వెంకట్ రెడ్డి ఆగ్రహం.
మేయర్ స్థానం కొసం కన్నేసిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం లేదని, వారు అమ్మిన అస్తులపైన కుట్ర చేస్తున్నారని మేయర్ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement