Monday, September 23, 2024

TG | పంద్రాగ‌స్ట్‌ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. పంద్రాగ‌స్ట్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

కాగా, ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కళాకారులు సంప్రదాయ దుస్తుల్లో మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా చేసే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడి, డప్పులు, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాలు కోలాటం, బైండ్ల జామిడికల్, చిందు యక్షగానం, కర్రసము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని తదితర వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పిల్లల్లో దేశభక్తిని రగిలించేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామరు.

ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ వెంకట్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement