Friday, September 20, 2024

Brick and Bolt : హైదరాబాద్‌లో అనుభవ కేంద్రాన్ని ప్రారంభించిన బ్రిక్ అండ్ బోల్ట్

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 12 (ప్ర‌భ న్యూస్) : వినియోగదారుల కేంద్రీకృత పరిష్కారాలకు గుర్తింపు పొందిన భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక ఆధారిత నిర్మాణ రంగ కంపెనీ బ్రిక్ అండ్ బోల్ట్, హైదరాబాద్‌లో తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (ఈసీ)ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మాదాపూర్‌లో ఉన్న ఈ ఆధునిక సదుపాయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానుల కోసం నిర్మాణ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడంలో బ్రిక్ అండ్ బోల్ట్ నిబద్ధతను హైలైట్ చేస్తుంది.

ఈసందర్భంగా బ్రిక్ అండ్ బోల్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జయేష్ రాజ్‌పురోహిత్ మాట్లాడుతూ… బ్రిక్ అండ్ బోల్ట్ కోసం హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో ఒకటిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం 200 ప్రాజెక్ట్‌లు ఇక్కడ కొనసాగుతున్నాయన్నారు. అపారమైన వృద్ధి సామర్థ్యం కలిగిన డైనమిక్ మార్కెట్‌గా, తమ కొత్త అనుభవ కేంద్రం మరింత ఆకర్షణీయంగా, పారదర్శకంగా, విశ్వసనీయమైన నిర్మాణ అనుభవాన్ని అందించడానికి తమ లక్ష్యంను కలిగి ఉందన్నారు.

బ్రిక్ అండ్ బోల్ట్ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ అర్పిత్ రాజ్‌పురోహిత్ మాట్లాడుతూ… తమ అన్ని అనుభవ కేంద్రాలన్నింటిలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి తాము అంకితభావంతో ఉన్నామన్నారు. స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ బ్రాండ్ ప్రమాణాలను రూపొందిస్తున్నామన్నారు. తమ హైదరాబాద్ ఈసీని నాణ్యత, బ్రిక్ అండ్ బోల్ట్ టేబుల్‌పైకి తీసుకువచ్చే పారదర్శకతను ప్రత్యక్షంగా అనుభవిస్తూ, కస్టమర్‌లు తమ నిర్ణయాలపై నమ్మకంగా ఉండగలిగేలా రూపొందించబడిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement