Monday, September 16, 2024

HYD | శంకర నారాయణ రచించిన ‘భరత సీమ’ ఆవిష్కరణ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హాస్య‌బ్రహ్మ శంకర్ నారాయణ రచించిన భరత సీమ శతకాన్ని చైతన్య విద్యా నికేతన్ చైర్మన్ శివరాత్రి యాదగిరి ఆవిష్కరించారు. చైతన్య విద్యా నికేతన్ హైస్కూల్ మగ్దూం నగర్ జగద్గిరిగుట్టలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాస్యబ్రహ్మ, ప్రముఖ పాత్రికేయుడు శంకర్ నారాయణ, రచయిత విశ్వేశ్వరరావు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో SOCH సంస్థ వచ్చి అంధులు పాడిన పాటలను విద్యార్థులను, తల్లి దండ్రులను ఆకర్షించినాయి. కళ్ళు లేకుండా పాటలు పాడి అందరినీ ఆకర్షించినారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, ప్రిన్సిపాల్ శివరాత్రి సాయి తేజ, డైరెక్టర్లు శివరాత్రి మంగాదేవి, డా.శివరాత్రి శృతివిద్య, శివరాత్రి నిఖిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement