Tuesday, October 1, 2024

HYD | కేవ్ ప‌బ్‌పై దాడి.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ సినీ, వ్యాపార ప్రముఖులు

హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడిన వ్యక్తుల వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. మొత్తం 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేవ్ పబ్ మేనేజర్ ఆర్ శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. విచారణ అనంతరం పబ్‌ను మూసివేస్తామన్నారు.

పబ్ యజమానులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. పబ్ యజమానులను అరెస్ట్ చేస్తే మరింత సమాచారం వస్తుందన్నారు. డ్రగ్స్ పై ఆయా కంపెనీలు ఉద్యోగులకు అవగాహన కల్పించాలని డీసీపీ వినీత్ సూచించారు. దాంతో పాటు ఐటీ కంపెనీలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement