Tuesday, September 17, 2024

గౌడ సంఘం సమావేశం

హైదరాబాద్‌ : గౌడ సోదరులంతా రాష్ట్రంలో కల్లుగీత పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ గౌడ సంఘం కార్యవర్గం నిర్ణయించింది. లక్డీకపూల్‌లోని సెంట్రల్‌కోర్డు హోటల్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్‌ అధ్యక్షత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గీత కార్మికుల సంక్షేమం, ఎక్స్‌గ్రేషియా అందజేతలో సమస్యలు, సభ్యత్వ నమోదు, గౌడ సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై అన్ని జిల్లాల అధ్యక్షులతో చర్చించారు.సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మొగుళ్ల అశోక్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్‌, కోశాధికారి వంగరవితోపాటు మాసగోని రాజయ్యగౌడ్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, అనురాధ గౌడ్‌, సూర్యాపేట జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటనారాయణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement