Friday, September 6, 2024

Hyderabad – హాస్ప‌ట‌ల్ కు వ‌స్తే మృత్యువు కాటేసింది.. విరిగిప‌డిన చెట్టు.. స్పాట్ లో భర్త కన్నుమూత …

హైదరబాద్ లోని బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళ దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

- Advertisement -

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారితో ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు. ఆసుపత్రి లోపలికి సరళ దంపతులకంటే ముందే ఒక బైక్ అక్కడి నుంచి వెళ్లింది.. అయితే వీరు తరువాత అటు నుంచే ప్రయాణించారు. వీరిపై విధి వక్రీకరించింది. ఒక్కసారిగా భారీ వృక్షం వీరిద్దరపై పడటంతో సరళ భర్త అక్కడికక్కడే మృతి చెందారు. సరళకు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సరళను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement