Monday, September 16, 2024

Hyderabad – ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి

హైదరాబాద్ లో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన గచ్చిబౌలిలో ఓ యువతి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైంది.

ప్రేమ పేరుతో తరుచూ వేధిస్తున్న యువకుడికి కొన్నాళ్లుగా యువతి దూరంగా ఉంటూ వస్తుండటంతో పగ పెంచుకున్న అతను ఆమె మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలి పరిధిలోని గోపన్ పల్లి తండా పరిధిలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

యువతిపై ప్రేమోన్మాది దాడి చేస్తుండగా గమనించిన పలువురు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, నిందితుడు వారిపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం.ఈ దాడిలో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వారంతా ప్రస్తుతం స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రేమోన్మాది దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement