Friday, September 6, 2024

Hyderabad – గొడ్డళ్ళతో పోలీస్ లపై దోపిడీ దొంగల దాడి – ఫైరింగ్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్‌: నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గురువారం అర్ధరాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు.

ఒక్కసారిగా పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆ తర్వాత పారిపోయేందుకు దుండుగులు యత్నించారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement