Sunday, September 8, 2024

గుడ్ న్యూస్: మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు

హైదరాబాద్ న‌గ‌ర ప్ర‌యాణికుల‌కు మెట్రో అధికారులు శుభ‌వార్త వినిపించారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. రేప‌ట్నుంచి ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. చివ‌రి రైలు ఒంటి గంట‌కు బ‌య‌ల్దేరి 2 గంట‌ల వ‌ర‌కు చివ‌రి స్టేష‌న్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్ సడ‌లింపుల నేప‌థ్యంలో మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక అన్ని ర‌కాల ప్ర‌జా ర‌వాణాకు మ‌రో గంట అద‌నంగా వెసులుబాటు క‌ల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement