Monday, September 16, 2024

Hyderabad పబ్బులపై ఎక్సైజ్‌ దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: దరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం చెల‌రేగింది. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌లో ఉన్న కోరం క్లబ్‌, బేజీలోన్‌ పబ్‌తోపాటు మరో మూడు పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 33 మందికి డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్స్‌తో టెస్టులు నిర్వహించారు. అందులో పాజిటివ్‌ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్‌, కేశవరావు, అబ్దుల్ రహీమ్.. పట్టుబడ్డ నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. పబ్‌లను సీజ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement