Monday, July 8, 2024

Hyderabad – వర్షంలోను కొనసాగుతున్న చంద్ర బాబు స్వాగత ర్యాలీ

హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు నేటి సాయంత్రం చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ వర్షం లో కొనసాగుతున్నది..

ఇక హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement