Friday, September 6, 2024

Hyderabad: భర్త మృతి… మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య

గుండెపోటుతో భర్త మృతిచెందడాన్ని జీర్ణించుకోలేక భార్య తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళ్​హాట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

సీఐ రవికుమార్​ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రహీంపురకు చెందిన అమన్‌కుమార్‌సింగ్‌(36)కు అప్పర్‌ ధూల్‌పేట ఆరాంఘర్‌కాలనీకి చెందిన అస్మిత(31)తో వివాహమైంది. వీరికి రోనక్‌, రిత్విక్‌ ఇద్దరు పిల్లలు ఉన్నారు. గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌సింగ్‌ గత నెల 26న రాత్రి బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందాడు. దీంతో 15 రోజులుగా భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని నిత్యం ఆస్మిత బాధపడేది. తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement