Saturday, September 21, 2024

TG: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో భారీగా బంగారం…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ఇవాళ భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు 4.8 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.

ముంబయి నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో చంద్రేష్ నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారంతో పాటు, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement