Saturday, October 19, 2024

Miyapur : ఎంత ప‌ని చేశావే చిరుత..

నగరం నడిబొడ్డున చిరుత కలకలం రేపిన ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన వారు అటవీ శాఖ అధికారులతో కలిసి చిరుత కోసం తీవ్రంగా గాలించారు.

ముఖ్యంగా చిరుత పాదముద్రల కోసం అటవీ సిబ్బంది గాలించారు. అనంతరం ఇవాళ ఉదయం అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని అటవీశాఖ అధికారులు క్షణ్ణంగా పరిశీలించారు. జంతువు కదలికలను బట్టి అది చిరుత కాదని.. అడవి పిల్లి అని తేల్చారు. దీంతో అక్కడున్న స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement