Thursday, September 5, 2024

TG: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు… మంత్రులు

కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు గడించవచ్చని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లు తెలిపారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాజు పల్లి గ్రామంలో పామాయిల్ పారిశ్రామిక సముదాయానికి శంకుస్థాపన చేశారు.

ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ… రైతులు వారితో పాటు ఇతర లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు ఎంపిక చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తుందన్నారు. లక్ష రూపాయల లోపు రుణాలను గురువారం వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కాన్సింగ్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, రామగుండం సీపీ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రీహర్షతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement