Saturday, June 29, 2024

High Court – కెసిఆర్ కు ఊర‌ట‌ … రైల్ రోకో కేసు విచార‌ణ‌పై స్టే….

మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 2011 రైల్ రోకో కేసుల్లో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.

అసలేమైంది..
2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని.. అసలు తాను రైల్‌రోకోలోనే పాల్గొనలేదని పిటిషన్‌లో తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు.. ఈ పటిషన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్ కు సానుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ కేసుపై స్టే విధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement