Friday, October 18, 2024

Judgement – తెలంగాణ గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు రేపే

హైకోర్టులో ముగిసిన విచార‌ణ‌
రేపు తీర్పు ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
ప్రిలిమ్స్ రద్దు చేయాలని,
ఎస్టీ రిజర్వేషన్ పెంపుచెల్లదంటూ కోర్టులో పిటిషన్
దీనిపై సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

హైదరాబాద్ : గ్రూప్‌-1పై రేపు హైకోర్టు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇ‍వ్వనుంది. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దుచేయాలని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు చెల్లదని, తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌లపై విచారణ జరిగింది. దీనిపై టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పిటిషన్‌లు దాఖలు చేశారని తెలిపారు.

- Advertisement -

నిపుణులు పరిశీలించిన తర్వాతే ఫలితాలు, కీ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 3 లక్షల మందికి లేని అభ్యంతరం ఒకరిద్దరికి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. మెయిన్స్‌ కోసం సిద్ధమవుతున్న వారిని అయోమయానికి గురిచేయకూడదని పేర్కొన్నారు. త్వరలో మెయిన్స్‌ జరగనున్న నేపథ్యంలో ఈ దశలో జోక్యం చేసుకోరాదని తెలిపారు. ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రశ్నలు తప్పని పిటిషనర్లు పేర్కొనడం సరికాదని చెప్పారు. వారికి అర్థంకాకపోతే ప్రశ్నే తప్పు అని నిర్ధారణకు రాకూడదని వాదించారు.. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రేపు తుదితీర్పు ఇస్తామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement