Friday, October 18, 2024

Breaking News: గ్రూప్-1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలకు అడ్డంకి తొలగింది. గ్రూప్-1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువరు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ జరగనుంది.

ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’ లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement