Tuesday, September 17, 2024

TG: హెటిరో అధినేత రూ.కోటి విరాళం.. మందులు కూడా విత‌ర‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం : తెలంగాణ వ‌ర‌ద బాధితుల స‌హాయ నిధికి బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో అధినేత బండి పార్థ‌సార‌థి రెడ్డి కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఖ‌మ్మం క‌లెక్ట‌ర్‌కు చెక్కు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మునుపెన్న‌డూ లేనంత‌గా వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని, బాధితుల‌ను ఆదుకోవ‌డానికి త‌మ వంతు స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఖ‌మ్మంలోనే వారం రోజుల‌పాటు ఉంటూ సింధు ఆస్ప‌త్రి వైద్యులు సేవ‌లు అందిస్తున్నార‌ని, ల‌క్ష‌లాది రూపాయ‌ల మందులు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement