Friday, September 20, 2024

TG: భారీగా పట్టుబడ్డ గంజాయి… పోలీసుల అదుపులో ఆరుగురు

బూర్గంపాడు, ఆగస్టు 2(ప్రభ న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ శివారు ప్రాంతమైన పల్లె పకృతి వనం ప్రాంతంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు బూర్గంపాడు మండల ఎస్సై రాజేష్, టాస్క్ ఫోర్స్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సుమన్, ప్రవీణ్ వారి బృందం నేతృత్వంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం ఉన్న మూడు కార్లు అదుపులో తీసుకొని విచారించగా సుమారు 250కేజీల గంజాయి పట్టుబడింది.


మూడు కార్లల్లో ఉన్న 12మంది వ్యక్తుల్లో ఆరుగురైన సారపాకకు చెందిన రావులపల్లి ప్రతాపు, ములగాడ అన్వేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోనసీమ జిల్లాకు చెందిన కాదతనోజు హర్షిత్, హైదరాబాద్ కు చెందిన కిషన్ కుమార్ దాస్, బంజారాహిల్స్ కి చెందిన బావికాడి శ్రీనివాస్ లను అదుపులో తీసుకొని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మిగతా ఆరుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టామని డి.ఎస్.పి సతీష్ కుమార్, సిఐ వినయ్ కుమార్, ఎస్సై రాజేష్ లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement