Thursday, September 19, 2024

TG: ఇది వికృత చ‌ర్యే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన హారీశ్ రావు

దాడులు చేయ‌డ‌మే ప్రజా పాల‌నా?
రేవంత్ అండ‌తోనే దాడులు
దాడిని నిలువ‌రించ‌డంలో పోలీసుల వైప‌ల్యం
కౌశిక్ రెడ్డికి భారీ భ‌ద్ర‌త క‌ల్పించాలి..


సిద్దిపేట – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దాడిని ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని సీరియస్ అయ్యారు. త‌మ‌ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిప‌డ్డారు.. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

రేవంత్ ప్రొద్బ‌లంతోనే దాడి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం అవుతుందన్నారు.

- Advertisement -

పోలీసుల వైఫల్య‌మే..
ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందన్నారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement