Tuesday, October 15, 2024

TG: తుపాకుల మోతతో దద్దరిల్లిన గుండాల అడవులు..

మావోయిస్టులకు – పోలీసులకు మధ్య కాల్పులు
కాల్పుల్లో దళ సభ్యుడు ఆశోక్ మృతి
ఏజెన్సీ గ్రామాల్లో భయాందోళన
అప్రమత్తమైన సరిహద్దు మండలాల పోలీసులు
పినపాక/గుండాల, జులై 25,(ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్ జిల్లా సరిహద్దు జిల్లాలోని మావోయిస్టులకు పోలీసులకు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనలో దళ సభ్యుడు ఆశోక్ అనే మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, గుండాల అడవుల్లో తుపాకులు మోత మోగడంతో ఏజెన్సీ గ్రామాల, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ కాల్పుల ఘటనలో మావోయిస్టులు ఎంతమంది ఉన్నారని, పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. గుండాల మండలం దామరతోగు గ్రామంలో ఈ కాల్పులు జరగడంతో, పినపాక, గుండాల, మణుగూరు, పోలీసులతో పాటు, ములుగు జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంతమంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో పాల్గొన్నార‌నేది పోలీసులు అంచనా వేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు ఎంతమంది ఉన్నారని, అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు-కూంబింగ్ పోలీసులకు మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement