Monday, October 21, 2024

Group 1 – బేగంపేట పరీక్షా కేంద్రంలో గోడ దూకిన అభ్య‌ర్ధిని … కేసు నమోదు

హైద‌రాబాద్ – గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవ్వగా అభ్యర్థుల్ని 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం లేటుగా వచ్చిన అభ్యర్థుల్ని గేటు బయటే ఆపివేయడంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చాలా కష్టపడి చదివాం సర్.. ప్లీజ్ గేట్లు తీయండి అని అభ్యర్థులు రోధిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థినిని లోపలికి అనుమతించకపోవడంతో గోడదూకగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేశారు పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement