Monday, October 21, 2024

Group 1 – అశోక్‌న‌గ‌ర్‌లో మ‌ళ్లీ టెన్షన్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : గ్రూప్-1 అభ్య‌ర్థులు అశోక్ న‌గ‌ర్‌లో ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అశోక్‌న‌గ‌ర్‌లో ఉద్రిక‌త్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అప్ప‌టికీ మొండికేయ‌డంతో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.

అనంత‌రం వివిధ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.ఓయూ జేఏసీ నేత అరెస్టు గాంధీ భ‌వ‌న్ ముట్ట‌డికి బ‌య‌ల్దేరిన ఓయూ జేఏసీ నేత మోతిలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అత‌న్ని బొల్లారం పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

జీవో 29ను ర‌ద్దు చేసే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని మోతిలాల్‌ హెచ్చ‌రించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement