Friday, September 20, 2024

TG: కొలనుపాక జైన దేవాలయంలో గవర్నర్ ప్ర‌త్యేక పూజ‌లు..

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొలనుపాక జైన దేవాలయాన్ని సందర్శించారు. గవర్నర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు.

కొలనుపాకలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర గవర్నర్ స్వామివారిని దర్శించుకొని, అభిషేక పూజలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement