Tuesday, September 17, 2024

TG | స్వర్ణ గిరి ఆలయంలో గవర్నర్..

భువనగిరి, (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామిని (గురువారం) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కలెక్టర్ హనుమంతు జెండాగే, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపీకృష్ణ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement