Saturday, September 21, 2024

TS: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం ఆమోదించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ఐదుగురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.

తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపించారు. అప్పటి నుంచి ఈ రాజీనామాలు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా న్యాయపరమైన సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం నేడు రాజీనామాలు అమోదించారు.. ఈ మేర‌కు రాజ్ భ‌వ‌న్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement