Thursday, September 19, 2024

WGL: సంక్షేమ రాష్ట్రానికి ప్రభుత్వం కృషి.. పోదెం వీరయ్య

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది.

ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య హాజరుకాగా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ లు ఘన స్వాగతం పలికారు.

పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యఅతిథి పోదెం వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. తెలంగాణ గీతం ఆలపించారు. అనంతరం ప్రభుత్వ ప్రగతిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, ఆర్డీవో మంగిలాల్, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement