Saturday, October 5, 2024

TG | డీజీపీ జితేందర్ ని కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన జితేందర్‌ను తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్‌కు పుష్పగుచ్ఛం అందించి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలకపాత్ర పోషిస్తుందని బీర్ల ఐలయ్య అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement