Friday, October 4, 2024

KNR: గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు..

డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేక అలంకరణ
ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి సంజయ్
కరీంనగర్ కల్చరల్, ఆంధ్ర ప్రభ : దేవీ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు దుర్గామాత అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవార్లను డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేకంగా అలంకరించారు.

నవరాత్రి వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు. భవాని మాలదారులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో మహాలక్ష్మీ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement