Thursday, September 12, 2024

TG: తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుని మృతి..

చెన్నూర్, ఆగస్టు 23(ప్రభ న్యూస్) : చెన్నూరు మండలం గుండయ్యపల్లి గ్రామానికి చెందిన ముక్కెర సతీష్ గౌడ్ అనే గీత కార్మికుడు తాటిచెట్టు పైనుండి పడి మృతిచెందాడు. తెలిసిన వివరాల ప్రకారం… గుండయ్యపల్లి గ్రామానికి చెందిన సతీష్ సమీప గ్రామమైన సుబ్బరంపల్లి గ్రామంలోని తాటిచెట్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు.

రోజు వారిలాగే ఇవ్వాళ సాయత్రం తాటిచెట్టు ఎక్కి గీస్తున్న సమయంలో అదుపు తప్పి క్రింద పడడంతో ఇరుగు పొరుగువారు గమనించి 108 సహాయంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతునికి భార్య కనకలక్ష్మి ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement