Saturday, September 7, 2024

KNR: గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త.. ఎస్పీ అఖిల్ మహాజన్

.. టెస్టింగ్ కిట్లు వచ్చాయి
..డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో తరచు తనిఖీలు
.. జిల్లాలో 8 మంది పై కేసు నమోదు
.. రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సిరిసిల్ల టౌన్ సి.ఐలతో కలసి గంజాయి కిట్లను ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించిన వారితో పాటు వారికి సరఫరా చేసిన 8మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి , 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement