Monday, September 16, 2024

Gadwal : బండ్ల‌తో మంత్రి జూప‌ల్లి బ్రేక్ ఫాస్ట్ టాక్..

గద్వాల ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రభ న్యూస్) : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా పత్రికల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమ‌ని అసెంబ్లీ లాబీల్లో ఇంతకు ముందు పరిచయం ఉన్న వారితో మాట్లాడడం తప్పేం కాదని అలా మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనసాగుతాడని మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో తెలిపారు. ఇదే సందర్భంలో గద్వాల నియోజకవర్గంలో ర్యాలంపాడు రిజర్వాయర్ నాలుగు టీఎంసీల నీటి నిల్వతో ఈ రిజర్వాయర్ ను ఏర్పాటు చేశారని అయితే లీకేజీల కారణంతో రెండు టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంచుతున్నారని ఇట్టి విషయంపై లీకేజీ పనులను త్వరగా పూర్తిచేసి నాలుగు టీఎంసీల నీటిని నిలువ ఉంచేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టి రైతులకు నీటిని అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.

అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమైన అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో కొనసాగుతారనే విషయం మీడియా ముందు ఆయన తెలుపలేదు, ఏ విషయంపై మాట్లాడలేదు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనసాగుతారని తెలిపారు. మంత్రి జూపల్లితో కలిసి అసెంబ్లీకి బయలుదేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement