Monday, September 16, 2024

Gadwal – ఆర్టీసీ బస్సులో ప్రసవం…

ఆశా కార్య‌క‌ర్త సాయంతో కాన్పు చేసిన‌ కండ‌క్ట‌ర్
త‌ల్లి బిడ్డ క్షేమం..
అభినందించిన మంత్రి పొన్నం.. ఆర్టీసీ ఎండి

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – రాజోలి : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి.. బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. గద్వాల నుంచి వనపర్తికి వెళ్లే పల్లె వెలుగు బస్సులో గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సంధ్య తన భర్తతో కలిసి వెళ్తోంది. వనపర్తికి 15 కిలోమీటర్ల దూరంలోని నాసినల్లి గ్రామం వద్ద మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహిళా కండక్టర్ భారతి స్పందించి, బస్సులో ఉన్న ఆశా కార్యకర్త సహకారంతో బస్సు నిలిపివేసి కాన్పు చేయగా.. ఆడశిశువు జన్మించింది. అనంతరం 108 వాహనంలో తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. బస్సు కండక్టర్‌ను అభినందించారు. కండక్టర్‌ సమయస్ఫూర్తి వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కొనియాడారు. అలాగే ఆర్టీసీ ఎండి స‌జ్జానార్ కూడా భార‌తిని అభినందించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement