Monday, October 21, 2024

TG: క‌లెక్ట‌ర్ల‌కు నిధులను అప్ప‌గించాలి : హ‌రీశ్‌రావు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న‌ల్ల‌గొండ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు కలెక్టర్ల కు ప్రభుత్వం నిధుల‌ను అప్పగించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అవసరమైతే ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు సైన్యం సహకారం తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించేందుకు హెలిక్యాప్టర్లను తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరికీ సహకరించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement