Saturday, September 21, 2024

అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి శంకుస్థాపన

రాష్ట్ర మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి సూర్యాపేట లో ప‌ర్య‌టిస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రెండు కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్న రోడ్లకు, పార్క్ ల నిర్మాణానికి మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌ను మిగ‌తా రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయ‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌న్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆయా వార్డుల‌ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement