Tuesday, October 22, 2024

TG | గోదావ‌రికి వ‌ర‌ద‌పోటు… చిక్కుకున్న ఇసుక కార్మికులు

మల్లాపూర్, అక్టోబర్ 21(ఆంధ్రప్రభ ) : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఒక్కసారిగా గోదావరికి వరద ఉదృతికి ట్రాక్టర్ లో ఇసుక నింపుతున్న కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరి వరదనీరు ఎక్కువ రావడంతో లేబర్ తో కలిసి ఒడ్డుకు చేరిన డ్రైవర్ గోదావరి నదిలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ వదిలేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో గోదావరి నీటి ఉదృతి పెరగటంతో ఇసుక తీసుకురావటానికి వెళ్లిన వారు గోదావరిలో చిక్కుకుని ఒడ్దుకు చేరారు. వాల్గొండ శివారులోని గోదావరిలో ఇసుక తీసుకురావటానికి పలువురు లేబర్లు, డ్రైవర్ ట్రాక్టర్ తీసుకుని వెళ్లారు. ఇసుక నింపుతుండగా ఒక్కసారిగా గోదావరి నీటి ఉదృతి పెరిగింది, గోదావరి మధ్యలో ఉన్నవాళ్లు చాకచక్యంగా ఈత ఈదుతూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు. ఇసుక తీసుకురావడానికి వెళ్లిన ట్రాక్టర్ గోదావరిలో మునిగి పోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement