Sunday, September 8, 2024

TG: భ‌ద్రాచ‌లం వ‌ద్ద వ‌ర‌ద ఉదృతి… 50అడుగుల ఎత్తులో నీటి ప్ర‌వాహం

రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ
ఆంద్ర‌ప్ర‌భ స్మార్ట్ – భ‌ద్రాచ‌లం : తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు నదులకు వరద తాకిడి పెరిగింది. ఈ క్రమంలో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉపనదులు పొంగిపొర్లడంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 50అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

ఇంద్రావతి ప్రాణహిత ఉపనదుల నుండి భారీగా వరద నీరు గోదారిలో కలుస్తోందని సమాచారం. ఎగువనున్న ఛత్తీస్ ఘ‌ఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు అధికారులు. ప్రాజెక్టుకు చెందిన ఇరవై ఒక్క గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

సుమారు 11.50 లక్షల క్యూసెక్కుల వరద నమోదు అవుతుందని, ఈరోజు రాత్రి 9 గంటలకు 51.20 అడుగులకు చేరుకుంటుందని సీడబ్ల్యుసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తున్నట్టు కనిపించినప్పటికీ మంగళవారం రాత్రికి 53 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర జల వనరుల సంఘం తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement