Friday, September 20, 2024

Flood Relief – రెడ్డి ల్యాబ్స్ రూ. 5 కోట్లు, బాలకృష్ణ రూ.50 ల‌క్ష‌ల విరాళం

తెలంగాణ వ‌ర‌ద బాదితుల కోసం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న
తేజ‌స్విని అభినందించిన రేవంత్

హైద‌రాబాద్ – వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50లక్షల రూపాయల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు..

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్లు విరాళంగా అందించారు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. నారాయణరెడ్డి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement